కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్య కళారాధనలో భాగంగా వి అంకారావు ప్రకాశం జిల్లా వారి బృందం చే ఏర్పాటుచేసిన తోలుబొమ్మలాట కార్యక్రమం భక్తులను ఆనందింప చేసింది. ఈ కార్యక్రమంలో కథకులుగా అంకారావు వ్యవహరించగా గాత్రం మంగమ్మ నరసింహారావు శివ నాగమ్మ కళ్యాణి తదితరులు అందించారు. ప్రాచీన సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా దేవాదాయ శాఖ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
previous post
next post