పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు కె.వి.ఎస్.ఫంక్షన్ హాల్ లో విశ్వంభర చారిటబుల్ ట్రస్టు ప్రథమ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సామాజిక సేవలు చేసిన సేవకులు, పారంపర్య ఆయుర్వేద వైద్యులను, కళాకారులను, గాయకులను, ఉత్తమ స్వచ్చంద సేవా సంస్థలను జాతీయ స్థాయిలో ఎంపిక చేసి సన్మానించారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చల్లగురుగుల మల్లయ్య కరోనా లాక్ డౌన్ కాలంలో నిత్యావసర వస్తువుల పంపిణీ, కరోనా సోకిన వారికి సేవా భారతి మెడికల్ కిట్ల పంపిణీ, ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేసిన సేవలను గుర్తించి జాతీయ స్థాయి ఉత్తమ పారంపర్య ఆయుర్వేద సేవా పురస్కారం అందజేశారు.
పురస్కారం అందించిన వారిలో ట్రస్టు వ్యవస్థాపకురాలు తాళ్లూరి సువర్ణకుమారి, రిటైర్డ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ రేగల గడ్డ సంజీవయ్య, ఇతర ప్రముఖుల చేతుల మీద జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి దుశ్శాలువతో సన్మానించారు.