సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల మర్రిగూడెం గ్రామానికి చెందిన కడియం అశోక్ నాయుడు రక్తదానం చేసిన ప్రాణాపాయం నుండి రక్షించాడు.
హుజూర్ నగర్ మండల బూరుగడ్డ గ్రామానికి చెందిన మహిళ అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలో చేరగా డాక్టర్ తగు పరీక్షలు నిర్వహించి రక్తం తక్కువ ఉందని చెప్పటంతో పట్టణంలోని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి ఫోన్ ద్వారా తెలియపర్చటంతో తక్షణమే స్పందించి ‘ఓ’ పాజిటివ్ రక్తం ఇప్పించడం జరిగింది.
ఈ సందర్భంగా డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ రక్తదానం అనేది ఎదుటివారి ఆరోగ్యాన్ని,వారిని రక్షించేందుకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారని,రక్తదానం చేసినవారికి మానసిక,శారీరక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.డిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ఫోన్ చేసిన వెంటనే స్పందించి రక్తం ఇచ్చిన అశోక్ నాయుడు ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో దగ్గుపాటి బాబురావు, జనచైతన్య ట్రస్ట్ చైర్మన్ పార సాయి నాయుడు,ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్