మాలల మనోభావాలు దెబ్బతీసేలా టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరించారని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన కాంగ్రెస్ మన ఊరు-మన పోరు బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే దీనిని మాలల చైతన్య సమితి తీవ్రంగా ఖండించింది.
సోమవారం మూలే కేశవులు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని ఉత్తరభారతంలో 17 రాష్ట్రాల్లో పాటు జాతీయ ఎస్సీ కమిషన్, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను వర్గీకరణ చెల్లదని అత్యున్నత న్యాయస్థానం 2004లో కొట్టివేయడం జరిగిందన్నారు.
కానీ ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. సభలో జనాలు కనిపించే వరకు గెలుస్తామని అహంకారంతో హామీలు ఇస్తూ మాలల మనోభావాలు దెబ్బ తీస్తే ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డి ని హెచ్చరించారు.
అదేవిధంగా కెసిఆర్, కిషన్ రెడ్డి లను కూడా హెచ్చరించారు. పెరిగిన ఎస్సీల జనాభా ప్రకారం 19.6 శాతం రిజ్వేషన్ పెంచుతామని దమ్ముంటే హామీ ఇవ్వండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, వనపర్తి, గద్వాల నియోజకవర్గాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి గెలుస్తామని సంకలు కొట్టుకుంటున్నారు. వచ్చిన వాళ్లంతా ఓట్లు వేయరు బిడ్డ రేవంత్ రెడ్డి వర్గీకరణ అంశం పై పదేపదే మాట్లాడితే తెలంగాణలో ఎక్కడా తిరగనివ్వం అంటూ హెచ్చరించారు.