సాక్షి టీవీ ప్రసారాలను తక్షణమే నిలిపేయాలని వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాశారు. అదే విధంగా సాక్షి టీవీ లైసెన్స్ను కూడా రద్దు చేయాలని ఆయన కోరారు. సాక్షి టీవీ లైసెస్స్ రద్దు, ప్రసారాల నిలిపివేతకు సంబంధించిన వ్యవహారంపై ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని ఆయన తన లేఖలో తెలిపారు. సాక్షి టీవీతో పాటు సాక్షి దినపత్రికను నడుపుతున్న సంస్థలకు జగన్ భార్య వైఎస్ భారతి చైర్ పర్సన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
previous post