తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న “బోనాల పండుగ” సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ అంబర్ పేట నియోజకవర్గం మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి, బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ రెడ్డితో కలిసి అంబర్పేట నియోజకవర్గం లోని 6.నం లో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడిలోని అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లకుంట డివిజన్లో ఉన్న ఆందోల్ మైసమ్మ ఆలయాన్ని సందర్శించి, బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనాల కార్యక్రమంలో సహకరించిన గోపాల్, బాబు బృందం కి వారు కృతజ్ఞతలు తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్