ఆదివారం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని లాల్ బాగ్, ధోబిఘాట్ మరియు నవాబ్ సాబ్ బాడలో పాదయాత్రగా పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లాల్ బాగ్ బస్తీ వాసులు డ్రైనేజీ లైన్, మంచి నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరగా, ధోబిఘాట్ లోని వారు సీసీ రోడ్లు, పలు చోట్ల వీధి దీపాలు కావాలని మరియు పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని కోరారు. నవాబ్ సాబ్ బాడ ప్రజలు తమకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం అని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రెండు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని అలాగే పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని వారు దృష్టికి తీసుకురావచ్చారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ప్రజలు కోరినట్లుగా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అలాగే డ్రైనేజీ, నీటి పైప్ లైన్లు, సీసీ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్