28.7 C
Hyderabad
May 5, 2024 10: 42 AM
Slider ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ చేతికి బోస్టన్ గ్రూప్ నివేదిక

bostan group

రాజధాని అంశంపై  సీఎం జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నేడు నివేదిక సమర్పించింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఓ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన బీసీజీ నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పూర్తి స్థాయి నివేదిక అందించింది.

రాజధానిపై ఇప్పటికే  జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదిక ఇస్తుంది. దీనికోసం హైపవర్ కమిటీ ఈ నెల 6న తొలిసారి భేటీ కానున్నది.

ఈ నెల 8 తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో రెండు నివేదికలపై ప్రభుత్వం చర్చించే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఈ రెండు నివేదికలపై అధ్యయనం అనంతరం మూడు వారాల్లోగా  ప్రభుత్వానికి హై పవర్ కమిటీ నివేదిక అందిస్తుంది.

Related posts

GO 317 : తొమ్మిదికి పెరిగిన ఉపాధ్యాయుల ఆత్మహత్యలు

Satyam NEWS

రెబెల్ వాయిస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుపైనే అభ్యంతరం

Satyam NEWS

‘‘నాకు కరోనా వచ్చిందని పుకార్లు సృష్టిస్తున్నారు’’

Satyam NEWS

Leave a Comment