భోలక్ పూర్ డివిజన్ దేవి చౌక్ వద్ద డీసీఎం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ తీగ తెగి పడిపోయింది. డీసీఎం వెనకాల వస్తున్న మహమ్మద్ సమీర్ (14) ద్విచక్రవాహనంపై విద్యత్ తీగ పడటంతో విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మహమ్మద్ ఖదీర్ సమోసా వ్యాపారం చేస్తుంటాడు. హోటల్స్ వెళ్లి కలెక్షన్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
previous post