29.7 C
Hyderabad
May 14, 2024 01: 04 AM
Slider ఆధ్యాత్మికం

అత్యంత వైభవంగా ముగిసిన రజకుల ఆరాధ్య దేవతా ప్రతిష్ఠా మహోత్సవం

#temple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వేపలసింగారం గ్రామంలో మడేలయ్య విగ్రహాల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి.

వేపలసింగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రజక కులస్తుల ఆరాధ్య దైవం మడేలయ్య గుడి నిర్మాణం,విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం శనివారం అత్యంత వైభ వంగా జరిగింది.ఋత్వికులు కొంకపాక సుబ్రహ్మణ్య శర్మ,భానుప్రకాష్ శర్మ ల ఆధ్వర్యంలో మడేలయ్య,మడేలమ్మ, పోతురాజు,శివపార్వతుల విగ్రహాలకు జలాభిషేకములు,పంచామృతాలతో, పసుపు,కుంకుమలతో అభిషేకాలు, బలిహరణ,ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగాయి.అనంతరం దేవాలయం వద్ద సామూహిక యాగాలు,పూజలు,  అన్నదానం కార్యక్రమం  నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్,సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి, ఎంపిటిసి ముడెం గోపిరెడ్డి,ఎన్నారై  సాముల జైపాల్ రెడ్డి దంపతులు,చెక్కర వీరారెడ్డి,కుందూరు శ్రీనివాస రెడ్డి, కుందూరు కోటిరెడ్డి,రజకసంఘం నాయకులు పెద్దారపు భవానీ శంకర్,దుగ్గి వర్మ,మడేలయ్య గుడి నిర్మాణ కమిటీ సభ్యులు ఉల్లెందుల వీరయ్య, వెంకటేశ్వర్లు,పెద్దారపు చిన్న శంకర్, వెంకటేశ్వర్లు,అనిల్,వడ్లానపు సత్యనారాయణ,రెగల్ల శ్రీను,నేర్ణకంటి కొండలు,పెద్దారపు బ్రహ్మం,పసుపులేటి కొండలు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

మన ఊరు-మన బడి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Satyam NEWS

పొగిడించుకోవడం తప్ప ఈ ప్లీనరీలో ఏముంది?

Satyam NEWS

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో దాసప‌దాల‌ సంకీర్త‌న

Satyam NEWS

Leave a Comment