ఏపీలో మరో 13 మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యం తో జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ క్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర లో విజయనగరం జిల్లాలో పార్వతీ పురంతో మరికొన్ని మండలాలను కలుపుతూ త్వరలో మన్యం జిల్లా ఏర్పాటు కు సిధ్ధం అవుతున్న వేళ..ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్. జిల్లాలోని పార్వతీపురంలోఎస్విడి. కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎస్వీడీ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు.ఈ మేరకు కాలేజీ నుండి ర్యాలీగా చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద మానవహారం చేపట్టారు.ఇదిలా ఉంటే
ఎస్వీడీ కాలేజీను ప్రభుత్వం పరం చేయాలని గడచిన పన్నెండు రోజుల నుంచీ విద్యార్ధులు రిలే నిరాహార దీక్ష చేపట్టిన…అటు అధికారులు గానీ ఇటు ప్రభుత్వం గానీ ఎటువంటి స్పందన రాలేదు. దీంతో విద్యార్థులలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో భారీ ర్యాలికి ఉపక్రమించారు. పట్టణంలో నిఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద ..విద్యార్థులు . పోలీసుల మధ్య. వాగ్వాదం. చోటు చేసుకుంది.దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది.పోలీసులు వైఖరి నశించాలంటూ ఎస్ఎఫ్ఐ నినాదాలు చేయడం విశేషం.