30.7 C
Hyderabad
April 29, 2024 06: 59 AM
Slider విజయనగరం

త్వరలో ఏర్పాటు కాబోతున్న మన్యం జిల్లా హెడ్ క్వార్టర్ లో…విద్యార్థుల నిరసన

#SFI

ఏపీలో మరో 13 మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యం తో జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ క్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర లో విజయనగరం జిల్లాలో పార్వతీ పురంతో మరికొన్ని మండలాలను కలుపుతూ త్వరలో మన్యం జిల్లా ఏర్పాటు కు సిధ్ధం అవుతున్న వేళ..ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్. జిల్లాలోని పార్వతీపురంలోఎస్విడి. కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఎస్వీడీ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు.ఈ మేరకు కాలేజీ నుండి ర్యాలీగా చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద మానవహారం చేపట్టారు.ఇదిలా ఉంటే

ఎస్వీడీ కాలేజీను ప్రభుత్వం పరం చేయాలని గడచిన పన్నెండు రోజుల నుంచీ విద్యార్ధులు రిలే నిరాహార దీక్ష చేపట్టిన…అటు అధికారులు గానీ ఇటు ప్రభుత్వం గానీ ఎటువంటి స్పందన రాలేదు. దీంతో విద్యార్థులలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో భారీ ర్యాలికి ఉపక్రమించారు. పట్టణంలో నిఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద ..విద్యార్థులు . పోలీసుల మధ్య. వాగ్వాదం. చోటు చేసుకుంది.దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది.పోలీసులు వైఖరి నశించాలంటూ ఎస్ఎఫ్ఐ నినాదాలు చేయడం విశేషం.

Related posts

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సుప్రీం సమర్ధన

Satyam NEWS

హైదరాబాద్ అభివృద్ధికి గులాబీ అభ్యర్ధులకే మీ ఓటు

Sub Editor

నీట్, జేఈఈ సాధన కు సమగ్ర మెటీరియల్ సిద్ధం

Satyam NEWS

Leave a Comment