బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత హామీలను నమ్మొద్దని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి ఉప్పల్ బిజెపి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ బిజెపి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఉప్పల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఎన్ ఎస్ ఎస్ ప్రభాకర్ ని కమలం పువ్వకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అంబటి వెంకటాచలం బిజెపి జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో టి ఎస్ ఎస్ ఐ సి కాలనీ లో ఇంటింటికి కరపత్రాలు స్టిక్కర్లు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాప్రా డివిజన్ ఎల్లారెడ్డి గూడలో ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ బిజెపి అభ్యర్థి ఎన్వీఎస్ ప్రభాకర్ అభ్యర్థించారు. కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా