27.7 C
Hyderabad
May 4, 2024 07: 38 AM
Slider హైదరాబాద్

కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కుంటుపడుతోంది

#shanti

కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కొంటుపడిందని నాచారం డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతి సాయి జన్ శేఖర్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమాన్ నగర్ బాబా నగర్ సావర్కర్ నగర్ లలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉప్పల్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అధిక మెజారిటీ గెలిపించాలని నాచారం డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతి సాయి జన్ శేఖ ర్ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. నాచారం డివిజన్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటు న్నారని కార్పోరేటర్ తెలిపారు. ప్రచారంలో భాగంగా దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడే తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించమని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

అమరావతి పై కాలు పెట్టి చేతులు కాల్చుకున్నారు

Bhavani

సౌదీ అరేబియాలో ఇంటి నుంచే ఈద్ కార్యక్రమం

Satyam NEWS

కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గోరేటి జంగయ్య

Satyam NEWS

Leave a Comment