ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాజాల సురేందర్ అన్నారు. సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జాజాల సురేందర్ కు మహిళామనులు బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఎలా ఆదరించారో ప్రస్తుతం అదే స్పూర్తితో ప్రచారం కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. 22 ప్యాకేజి పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. ప్రతిపక్షాలు మతి లేకుండా మాట్లాడుతున్నామని మండిపడ్డారు. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాలువలు తవ్వి వదిలేయడం తప్ప పూర్తి చేసారా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మరింత వేగంగా రాష్ట్ర అభివృద్ధి సాగుతుందన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.
సత్యం న్యూస్, కామారెడ్డి