కరోన వైరస్ లాక్ డౌన్ సందర్భంగా చింతకాయలపల్లెలో మాజీ ఎమ్మెల్సీ, రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆదేశాల మేరకు అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బారతాల శ్రీధర్ యాదవ్, చుక్కా యానాది సహకారంతో 50 ఎస్.సి., ఎస్.టి. రజక కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో చుక్కా కొండయ్య, బువనబోయిన నరసయ్య, తోకల వెంకటసుబ్బయ్య, తాళ్ల చిన్న పెంచలయ్య, తోకల యానాది, తాళ్ల లక్షమయ్య, చుక్కా మహేష్, జి శ్రీను, జి నరసింహులు, కడప చంద్ర, జి యానాది, ఏ. పెద్ద రాయుడు, సి. వెంకటేశ్, టి హరి, సి. దీక్షిత్, సి. గణేశ్, బి అజయ్,ఏ. ప్రసాద్ మరియు చింతకాయలపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు