విశాఖ పట్నం సమీపంలోని భీమిలీ ప్రాంతంలోని మంగమారిపేట బీచ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. స్నా
నానికి దిగి ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయి మరణించారు.
మృతులను వాసుపల్లి యశ్వంత్ కుమార్(13), దౌలపల్లి అజిత్ కుమార్(15)గా పోలీసులు గుర్తించారు.
ఈ ఇద్దరు చిన్నారులు మంగమారిపేట గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.