Slider మహబూబ్ నగర్

గ్రంథాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి!

#kollapur

గ్రంథాలయ భవన నిర్మాణ పనులను నాణ్యతతో త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను నాగర్ కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాధవరం హనుమంత రావు ఆదేశించారు. బుధవారం కొల్లాపూర్ పట్టణంలో 25 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాధవరం హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడ వద్దన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ మల్లయ్యను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు బంగారయ్య, గ్రంథ పాలకుడు మేకల సుబ్బయ్య, సింగోటం సర్పంచ్ మండ్ల కృష్ణయ్య, అమరగిరి ఉప సర్పంచ్ మల్లేష్, భారత్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Related posts

7న ఆదివాసీల భారత్ బంద్

Bhavani

వచ్చే ఎన్నికలు పారదర్శంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Bhavani

పోలీసు అమరవీరుల త్యాగాలు వృధా కారాదు

Satyam NEWS

Leave a Comment