మహిళలు సమాజంలో ఎదురయ్యే ఆటుపోట్లుకు ఎదురొడ్డి నిలబడి స్వశక్తితో ముందుకు సాగాలని ములుగు, భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. బుధవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివిధ రంగాలలో పని చేస్తున్న మహిళలను దాస్తావేజులేఖర్లు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తస్లీమా మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని,అన్ని రంగాలలో రాణిస్తూ స్వయం కృషితో జీవించాలని తస్లీమా అన్నారు. శృష్టికి మూల కారణమైన స్త్రీలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మహిళలు ఒకరినొకరు గౌరవించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని తస్లీమా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది,తదితరులు ఉన్నారు.
previous post