తెలంగాణ తెచ్చింది మేమె కాబట్టి జీవితాంతం మాకే ఓట్లు వేయాలని కెటిఆర్ మాట్లాడటం ప్రజాస్వామ స్ఫూర్తికి విరుద్ధమని టిపిసిసి కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. సోనియా గాంధీ సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం, తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, సబ్బండ వర్గాల సమిష్టి కృషి వల్లనే ప్రత్యేక తెలంగాణ సిద్దించిందన్న విషయాన్ని కెటిఆర్ గుర్తెరగాలని ఆయన అన్నారు.
కేంద్రంలోని మిత్ర పక్షాలను ఆనాడు యుపిఏ చైర్ పర్సన్ సోనియ గాంధి ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోతే కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఎంటో ఒక్కసారి గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అమెరికలో ఉన్న కెటిఆర్ ఉద్యమకారులకు ఫోన్ చేసి ‘‘అంకుల్ మీరైనా మా డాడి కి చెప్పండి తెలంగాణ రాదు’’ అని చెప్పింది వాస్తవం కాదా అని బండి సుధాకర్ ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీని మోసం చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకొని రాజ్యంమేలు తుంచి మీరు కాదా ? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని నిధులు, నీరు, నియామకాలు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తే రాబందుల్లా తెలంగాణ సంపద దోచుకొని దాచుకుంటుంది మీ కుటుంబం కాదా అని ఆయన ప్రశ్నించారు.
అనునిత్యం టి ఆర్ ఎస్ నాయకులు దౌర్జన్యాలు , పసిపిల్లలు, మహిళలపై అత్యాచారాలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమై తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బండి సుధాకర్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్ని పరిణామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రానున్నా రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్దగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.