ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారందరికి గులాబీ కండువాలు కప్పి, బీఆర్ఎస్ లోకి ములుగు జడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్ ఆహ్వానించారు.
కొత్తగూడ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు ఆధ్వర్యంలో పోగుళ్లపల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవుల యాకయ్య మరియు మాజీ వార్డు మెంబరు గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు చిలుకల అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రాజు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ సమక్షంలో టీఆరెఎస్ లో చేరారు. వాళ్లకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ, దేశంలోనే బిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు.
ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కెసిఆర్ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ లీడర్షిప్ ఉన్న పార్టీ అని చెప్పారు. భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు.
ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో కొత్తగూడ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు కొత్తగూడా బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్ పోగుళ్లపల్లి ఎంపీటీసీ బైరబోయిన సదానందం సాదిరెడ్డిపల్లి ఎంపీటీసీ నన్నబోతుల స్వప్న లింగన్న పోగుళ్లపల్లి సర్పంచ్ అజ్మీర మంగమ్మ రవి పొగుళ్లపల్లి మేడారం ట్రస్టు బోర్డ్ డైరెక్టర్ నక్క సాంబయ్య బోళ్ల అనిల్ మరియు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.