సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో DMFT నిధుల ద్వారా మంజూరు అయిన 10 లక్షల రూపాయలతో CC రోడ్ల నిర్మాణానికి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంఖుస్థాపన చేశారు.
అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో అందరూ సమిష్టిగా ఉండి అభివృద్ది చేసుకోవాలని అన్నారు. వేములూరివాగు నిర్మాణం, SC కమ్యూనిటి హాల్ మంజూరు కొరకు కృషిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి పెండెం శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి పోరెడ్ల మహాలక్ష్మి గోవింద్ , వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.