జాతీయ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కె. లలిత్ కుమార్ నియమించారు.
ఈ విషయాన్ని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వైభవ్ తివారి, ఉపాధ్యక్షులు సౌరబ్ సక్సేనా, ప్రధాన కార్యదర్శి అలోక్ దీక్షిత్, జాయింట్ సెక్రటరీ వినయ్ కుష్వాల్ తెలిపారు.
ఈ మేరకు ఆయన కు నియామక పత్రాన్ని అందజేశారు. విద్యా రంగం లో విస్తృత పరిచయాలున్న లలిత్ కుమార్ ను ఈ పదవి కి ఎంపిక చేశామన్నారు.
ప్రస్తుతం లలిత్ కుమార్ ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం , అభీష్ట ఆన్లైన్, కంచన ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నారు.