సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చౌటపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో శుక్రవారం గ్రామ సర్పంచ్ కృష్ణవేణి నరేష్ కి మైహోమ్ యాజమాన్యం 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భముగా మైహోమ్ ప్లాంట్ హెడ్ శ్రీనివాస రావు మాట్లాడుతూ స్థానిక చౌటపల్లి గ్రామ పంచాయితీ నుండి మెళ్ళచెరువు వెళ్ళే రహదారి సిసి రోడ్డు నిర్మాణమునకు ఈ ఇరవై లక్షలు ఆర్ధిక సహకారం మైహోం పరిశ్రమ యాజమాన్యం సి.ఎస్.ఆర్ ఫండ్స్ గా అందిస్తుందని తెలిపారు.
గతంలో కూడా సామాజిక బాధ్యతగా గ్రామ అభివృద్ధికి,కోవిడ్ పరిస్థితుల్లో మైహోమ్ సహకారం అందించిందని తెలిపారు. గ్రామ సర్పంచ్ కృష్ణవేణి నరేష్ మాట్లాడుతూ మైహోమ్ పరిశ్రమ యాజమాన్యం గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ ఆదిలక్ష్మి నాగిరెడ్డి,యం.పి.టి.సి సైదా కుమారి కాశయ్య,పంచాయితీ సెక్రటరీ కవిత, మైహోమ్ ప్లాంట్ హెడ్ శ్రీనివాస రావు, హెచ్.ఆర్ హెడ్ నాగేశ్వర రావు, మైన్స్ హెడ్ శ్రీనివాస రావు,రత్నం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్: