సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు),ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలోని పదవ తరగతి విద్యార్ధినీ, విద్యార్థులకు మే 23 నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాల్ టిక్కెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్ధినీ విద్యార్థులందరూ పరీక్షలకు క్రమం తప్పకుండా హాజరై మంచి గ్రేడ్ సాధించాలని,పైచదువులకు అందరూ వెళ్ళి పాఠశాలలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎండి అబ్దుల్ లతీఫ్,రాధా దుర్గ,తాతరాజు శ్రీనువాస్, వేముల శ్రీనివాస్,లోకసాని శ్రీనివాస్ రెడ్డి,పతంజలి శాస్త్రి,వై ఉపేందర్, జయమ్మ,షమీమ్ తదితర ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్