అమరుల త్యాగఫలం, కేసీఆర్ దీక్ష ఫలంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో అక్రమ కేసులు పెట్టి ఖమ్మం జైల్ కీ తీసుకువచ్చినప్పుడు కేసీఆర్ ప్రధాన ముద్దాయి కాగ సంపత్ రెండో ముద్దాయిగా ఉండడం అభినందనీయమని, ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం
అధ్యక్షుడిగా ఏక ధాటిగా 11 సంవత్సరాల పని చేసి రాష్ట్రఉపాధ్యక్షునిగా మూడు సంవత్సరాల పాటు పని చేసి 20 సంవత్సరాల తన యవ్వనాన్ని జైలు గోడల మధ్యలో గడపడం గర్వించదగ్గ విషయమని ,46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ ఖమ్మం పట్టణంలో విద్యార్థి ఉద్యమాన్ని ముందుండి నడిపించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మలిదశ విద్యార్థి యువజన ఉద్యమకారులు అందర్నీ గుండెల్లో పెట్టి చూసుకుంటానని, ఇప్పటికే మలిదశ ఉద్యమకారులకు వివిధ రూపాలలో సహాయ సహకారాలు అందించడం జరిగిందని రాబోయే ఎన్నికలలో ఏర్పడేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు వరుసలోనే అనేక పదవులు రాబోతాయని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తెలంగాణ విద్యార్థి యువజన ఉద్యమకారులు గడపగడపకు కేసిఆర్ అభివృద్ధి పథకాలు తీసుకొని వెళ్లాలని ,ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు పోనుగోటి సంపత్ మాట్లాడుతూ ఈసారి ఎన్నికలలో పువ్వాడ అజయ్ కుమార్ గెలుపు కోసం కాదని మెజార్టీ కోసం అహర్నిశలు కష్టపడతానని, అదేవిధంగా వచ్చే నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మలి దశ తెలంగాణ విద్యార్థి యువజన ఉద్యమకారులతో పువ్వాడ అజయ్ కుమార్ గారి
నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని వారి ఆదేశానుసారం వారి మార్గదర్శకాలు పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగానని ఏ పార్టీ కండువా కప్పుకోలేదని చివరి వరకు పువ్వాడ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి ఉద్యమకారులు కామేష్, మురళి, విజయ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.