జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఏడాది బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారు. మహాముత్తరం మండలం సింగంపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కలుగూరి మల్లక్క దుర్గేశ్ దంపతుల కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆ బాబును ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు పోయారు. ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తమ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరిని పట్టుకోవాలని దంపతులు పోలీసులను కోరుతున్నారు. ఊరు లోని సీసీ టీవీ పుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి పిల్లవాడిని తీసుకువెళ్లినట్లు రికార్డు అయి ఉంది. అయితే వారు హెల్మెట్ ధరించి ఉన్నారు. అందువల్ల వారిని గుర్తుపట్టే వీలు లేకుండా పోయింది.