41.2 C
Hyderabad
May 4, 2024 15: 58 PM
Slider చిత్తూరు

ఓ మహిళను ఆదుకున్న చిత్తూరు పోలీసులు

#Chittoor police

ఇంటిపై కొందరు దాడి చేసి అన్యాయంగా తమను కొడుతున్నారని ఓ మహిళ దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పంజని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
పంజని గ్రామంలో నివాసం ఉండే గంగాధర్, గట్టప్ప కుటుంబాలకు మధ్య స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ల్యాండ్ కు సంబంధించిన అంశం కోర్ట్ లో ఉంది.

ఈ నేపథ్యంలో గట్టప్ప, శంకరయ్య, మరికొందరు గంగాధర్ ఇంటికెళ్లి గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి గంగాధర్ ను, అడ్డువెళ్లిన కుటుంబసభ్యులపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. భయాందోళనకు గురైన గంగాధర్ భార్య దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడిలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా గట్టప్ప, శంకరయ్య లపై ఐపీసీ సెక్షన్ 427, 354 D, 323, 506, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద పంజని పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించండి

Satyam NEWS

7 న సరూర్ నగర్ స్టేడియంలో మ్యూజిక్ హంగామా

Satyam NEWS

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా స్ట్రెయిన్‌ కలకలం

Satyam NEWS

Leave a Comment