ఇంటిపై కొందరు దాడి చేసి అన్యాయంగా తమను కొడుతున్నారని ఓ మహిళ దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పంజని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
పంజని గ్రామంలో నివాసం ఉండే గంగాధర్, గట్టప్ప కుటుంబాలకు మధ్య స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ల్యాండ్ కు సంబంధించిన అంశం కోర్ట్ లో ఉంది.
ఈ నేపథ్యంలో గట్టప్ప, శంకరయ్య, మరికొందరు గంగాధర్ ఇంటికెళ్లి గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి గంగాధర్ ను, అడ్డువెళ్లిన కుటుంబసభ్యులపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. భయాందోళనకు గురైన గంగాధర్ భార్య దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దాడిలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా గట్టప్ప, శంకరయ్య లపై ఐపీసీ సెక్షన్ 427, 354 D, 323, 506, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద పంజని పోలీసులు కేసు నమోదు చేశారు.