లండన్ నుంచి 15 మంది ప్రయాణికులు నల్గొండ జిల్లాకు రావడం కలకలం రేపుతున్నది. నల్లగొండ జిల్లాకు 9 మంది సూర్యాపేట జిల్లాకు ఐదుగురు, యాదాద్రి జిల్లాకు ఒక్కరు లండన్ నుంచి వచ్చారు.
వీరిని జిల్లా వైద్య శాఖ అధికారులు సకాలంలోనే గుర్తించారు అయితే వీరు ఎక్కడెక్కడికో వెళ్లడం ఇప్పుడు ఆందోళనకు కారణం అవుతున్నది.
అయితే వీరిలో ఒకరు నిజామాబాద్ వెళ్లగా, మరొకరు విజయవాడ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన ఏడుగురిలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారించారు.
దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ ఇంగ్లాండ్లో ఉధృతంగా వ్యాప్తిచెందగా, అక్కడి నుంచి ఇటీవల నల్లగొండ జిల్లాకు వచ్చిన వారి నుంచి వైద్యాధికారులు స్వాబ్ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.
అయితే స్ట్రెయిన్ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయా? లేదా? తెలుసుకునేందు కు ఆయన శాంపిళ్లను పూణెలోని సీసీఎంబీ ల్యాబ్కు పంపారు.