రాయల్ స్టాక్, హంగామా మ్యూజిక్ సహకారంతో భారతదేశపు అగ్రకళాకారులు రేవంత్, జూవేద్ అలీ, సిద్దార్థ్ మహాదేవన్, హర్డి సంధు, జాస్సీ గిల్, జచీత్ గంగులి తదితరులు మ్యూజిక్ హంగామా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో నిర్వహించిన ఈ మ్యూజికల్ కచేరి ప్రేక్షకులచే మన్నలను పొందింది.
తాజాగా ఈ నెల 7 నా హైదరాబాద్ లోని సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియం లో ఈ కచేరిని నిర్వహించబోతున్నట్లు రాయల్ స్టాగ్ హంగామా మ్యూజిక్ డిజిటల్ మీడియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్దార్థ రాయ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ లగ్జరీ మ్యూజిక్ బస్సులో భారతదేశపు ఏడు రాష్ట్ర్రాల్లోని 11 నగరాల్లో ప్రయాణించి ఒక్కో నగరంలో ఒక కళాకారుడు ప్రత్యేక్ష ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ , భువనేస్వర్, సిలిగురిలలో ఈ మూజిక్ కచేరీలు ఇప్పటికే జరిగాయి. మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్, పూణే, కర్నాల్, అంబాలా, అల్వార్ లకు కూడా ఈ బస్సు ప్రయాణించనున్నట్లు తెలిపారు. కాన్స్ ర్ట్ – ఆన్ -వీల్స్ అనేది ఒక అద్బుతమైన కాన్పెప్ట్, ఇది సంగీత ప్రియులను తమ అభిమాన కళాకారులకు దగ్గర చేస్తుంది. ఈ ప్రదర్శనతో అభిమానులతో కనెక్ట్ అవ్వడానకి, వారి హృదయాలను గెలుచుకోవడానికి ఉపకరిస్తుంది.