వర్షాకాలం ప్రారంభమైంది వివిధ రకాల వ్యాధులు విజృంభించి ప్రజల ఆరోగ్యాన్ని అతలాకుతలం చేసే ప్రమాదముంది మండలం లో ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా పెదవేగి ప్రాథమిక వైద్యాధికారులు డాక్టర్ మాధవి, డాక్టర్ త్రిపోష సూచించారు. డెంగ్యూ మాసోత్సవాలను పురస్కరించుకుని పెదవేగి మండల కేంద్రం లో గురువారం వైద్య సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ ఆపేశారు.
రోజే మేరీ ఆద్వర్యం లో పెదవేగి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక తహశీల్దార్, పోలీస్ స్టేషన్, మండల పరిషత్, వెలుగు కార్యాలయాల వద్ద మానవహారం గా ఏర్పడి జనావాస ప్రాంతాలలో, గృహాల వద్ద నీటిగుంటలు పూడ్చండి దోమ కాటునుండి రక్షణ పొందండి అని నినాదాలిచ్చారు.
డాక్టర్ లు దోమకాటువాళ్ళ వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, బోధ వ్యాధుల గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు విజయ్ వర్ధన్, మెడికల్ సూపర్ వైజర్లు రమేష్, మురళి, యామిని, లక్ష్మీ సచివాలయాల ఎం ఎల్ హెచ్ పి లు.ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్ లు పాల్గొన్నారు