నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో చాకలి మడుగుపై నిర్మించిన వంతెనను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. చుక్కయిపల్లి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు 40 లక్షల రూపాయల నిధులతో చాకలి మడుగుపై వంతెనను నిర్మించి నేడు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు అడ్డంకిగా మారిన చాకలి మడుగు వాగుపై ఇచ్చిన మాట ప్రకారం వంతెన మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయించిన ఘనత ఎమ్మెల్యే కు దక్కుతుంది. తమ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే కి చుక్కయిపల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మెన్, కౌన్సిలర్స్,కో ఆప్షన్ సభ్యులు,సింగిల్ విండో డైరెక్టర్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్