పవిత్ర పుణ్య క్షేత్రమైన గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండలో కార్తీక మాసం సందడి వైభవంగా ఆరంభం అయింది. నేడు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి దర్శనానికి తరలి వచ్చారు. నేటి తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కోటప్పకొండకు చేరుకున్నారు. మొత్తం 175 అభిషేకాలు నిర్వహించినట్లు కోటప్పకొండ ఇవో రామకోటిరెడ్డి తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు అందచేశారు.
శరత్ , సత్యంన్యూస్.నెట్