30.7 C
Hyderabad
April 29, 2024 04: 49 AM
Slider తెలంగాణ

ఆయారాం:మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేతనం: రేవంత్

revanth-reddy

తెలంగాణలో మునిసిపాలిటీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతూండగా, మరోపక్క కాంగ్రెస్ అధికార పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ గెలుపు తమదే అంటోంది.ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో గల మున్సిపల్ కార్పొరేషన్స్ లో అధికార పార్టీ ముఖ్యనేతలను తమ పార్టీ లోకి చేరేలా చక్రం తిప్పుతున్నారు.


టీఆర్ఎస్ రెబల్ నేత దుర్గ దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరాడు. ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.దయాకర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అనుచరుడిగా కొనసాగుతోన్నారు. ఆయన మల్కాజ్ గిరి పరిధిలోకి వచ్చే పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఆశించారు. దీనికి టీఆర్ఎస్ అదిష్ఠానం అంగీకరించకపోవడంతో దయాకర్ రెడ్డి పార్టీని వీడినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తుందన్నారు. మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. డబ్బులతో, అక్రమ కేసులతో రాజకీయాలు చేయానుకునేవారికి తాజా పరిణామాలు కనువిప్పు అని పేర్కొన్నారు. పీర్జాదిగూడలో కాంగ్రెస్ గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ వార్డులన్నింటినీ సొంతం చేసుకుంటుందన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరికి అండగా నిలబడతానని రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Related posts

కరోనా హెల్ప్: నిరుపేదలకు గోధుమల పంపిణీ

Satyam NEWS

తిరుమల-మెడికోవర్ సహాయంతో పోలీసులకు ఉచిత వైద్య పరీక్ష

Satyam NEWS

అమెరికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కలవరం

Sub Editor

Leave a Comment