కడపజిల్లా పుల్లంపేట లోని చేనేత సహకార సంఘాలలో జరుగుతున్న అవకతవకలపై సి.ఐ.డి అధికారులు విచారణ చేపట్టారు. కడప జిల్లా పుల్లంపేటలోని శ్రీరాములుపేట, కొత్త పేట పార్ధసారధి చేనేత సహకార సంఘాల అక్రమాలపై గురువారం సి.ఐ.డి ఇన్ స్పెక్టర్ పార్థసారథి విచారణ జరిపారు.
మండల పరిధిలోని దాదాపుగా 28 ఏండ్ల నుంచి దాదాపు 200 మంది సభ్యులతో నాలుగు చేనేత సంఘాలు ఉన్నాయి. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ అందులో ఉన్న లబ్ధిదారులకు అందడం లేదు. వీటిపై పలు ఆరోపణలు రావడంతో సి.ఐ.డి అధికారులు ఈ సొసైటీలో అవక తవకాలపై గ్రామాలను సందర్శించి విచారణ చేపట్టారు. సభ్యులను స్వయంగా విచారించి నివేదిక తయారు చేసి సంబంధిత సొసైటీలపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.