ప్రముఖ సినీ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్ గా నియమించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడైన కృష్ణంరాజు గతంలో పార్లమెంటు సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. రాజకీయంగా ఆయన బిజెపితోనే చాలా కాలంగా ఉన్నారు.
బిజెపి కేంద్ర నాయకత్వం ఆయన బిజెపికి అందిస్తున్న సేవలను చాలా కాలం కిందటే గుర్తించింది. అవకాశం రాగానే ఉన్నత స్థానంలో నియమిస్తామని చాలా కాలం కిందటే కృష్ణంరాజుకు అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.
ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకునే కృష్ణంరాజుకు ఇప్పుడు అత్యున్నత పదవి దక్కబోతున్నది.