కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి 32 లక్షల 03 వేల 712 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముబారాక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. అనంతరం కామారెడ్డి నియోజకవర్గంలోని 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 18 లక్షల 64 వేల 500 రూపాయల చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 7,698 మందికి 76 కోట్ల 67 లక్షల 60 వేల 648 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను, 1,585 మందికి 9 కోట్ల 91 లక్షల 65 వేల 800 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పెద్దలాగ 1,00,116 రూపాయలు కళ్యాణలక్ష్మి, షాది ముభారాక్ వంటి పథకాల ద్వారా ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయ నిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ఇచ్చిన పత్రాలను సకాలంలో తమ కార్యాలయంలో అందజేసినట్లైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇప్పించే విధంగా చూస్తామని ఆయన అన్నారు.