సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన రహదారి ఇందిరా చౌక్ నందు గల NTR విగ్రహానికి 25వ, వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హుజూర్ నగర్ టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షుడు తండు సాయి రామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన మహానేత ఎన్టీఆర్ అని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం NTR కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చలనచిత్ర రంగంలో మకుటంలేని మహా రాజుగా వెలుగొందిన నటి సార్వభౌముడని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా సహదేవరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నల్లమాద శ్రీనివాస్, పార్లమెంట్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ రామజోగి గౌడ్,
తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస్ నాయుడు,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవుల పాటి శ్రీను, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ సైదా, టిడిపి బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్, మఠంపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రావిరాల లింగయ్య, కొమ్ము మధు బాబు,
చల్లా వంశీకృష్ణ, దొంతగాని సోమయ్య, రాష్ట్ర నాయకులు కొమ్ముగాని వెంకటేశ్వర్లు, ఐల వెంకన్న గౌడ్, పొందూరి సత్యనారాయణ, వేముల సీతారాములు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మీసాల సైదులు, దుర్గాప్రసాద్, సత్యనారాయణ, మేకల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, కోటయ్య,తారక రామారావు, పార్టీ అభిమానులు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.