31.2 C
Hyderabad
May 3, 2024 02: 55 AM
Slider హైదరాబాద్

జమ్మిగడ్డ స్మశానవాటిక స్థలం కేటాయించాలని కోరుతూ నేడు చలో కలెక్టరేట్

#kapracircle

హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ స్మశానవాటికకు అధికారికంగా స్థలం కేటాయించాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కీసరలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ (కాప్రా సర్కిల్) అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.., స్మశాన వాటిక లో కనీస సదుపాయాలు లేక గత దశాబ్దకాలంగా సుమారు 20 కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరన్నారు.. స్మశాన వాటికకు  అధికారికంగా స్థలం కేటాయించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాడుతున్నమన్నారు. ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన జమ్మిగడ్డలోని స్మశాన వాటిక స్థలంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే, మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. జమ్మిగడ్డ పరిధిలోని 20 కాలనీల ప్రజలతోపాటు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

Satyam NEWS

ఏనుగు హ‌ల్‌చ‌ల్‌.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

Sub Editor

అరవింద్ కాటన్ మాస్కుల అందజేత

Sub Editor

Leave a Comment