రెండు రోజుల పర్యటనలో భాగంగా కడప విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాధ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బు రాజన్ కడప విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ కు స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి ఇడుపులపాయకు చేరారు.
రేపు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు.