ప్రతిష్టాత్మక మైన గురజాడ జేఎన్టీయూ లో ఫుడ్ పాయిజన్ అంశం కలకలం రేగింది. జేఎన్టీయూ లో లేడీ స్ మెస్ లో ఆహారం తిని దాదాపు పన్నెండు మంది విద్యార్ధినీలు హాస్పిటల్ పాలయ్యారన్న వార్త కలకలం రేగింది. ఈ మేరకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ తక్షణమే స్పందించి.. ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లు, ఫుడ్ మాస్టర్.. దాంతో పాటు స్టూడెంట్ మెస్ మెంటైనన్స్ తో కూలం కూషంగా చర్చించి…అసలు ఎలా జరిగింది..? విద్యార్ధినీలు ఎప్పుడు తీసుకున్నారు…ఏం తిన్నారు…. అన్న విషయాలపై దృష్టి పెట్టి…కనీస జాగ్రత్తలు… నివారణ చర్యలు తీసుకున్నారు.
సీన్ కట్ చేస్తే…లేడీ స్ కూ సంబంధించి వేగవతి మెస్ రూమ్ ను స్వయంగా ఫుడ్ ఇన్ స్పెక్టర్ ను తీసుకెళ్లి… విచారణ చేయించారు. కాగా మెస్ మొత్తం గతంలో లాగానే కాంట్రాక్టర్ కు ఇవ్వాలన్న ఉద్దేశ్యం తో కావాలనే.. ఈ కలుషిత ఆహార అన్న అంశం తెరపైకి తెచ్చారన్న వాదన కూడా జేన్టీయూలో వినిపిస్తోంది.