సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి తన కార్యదర్శిగా ఎలా పెట్టుకుంటారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. బాధ్యత లేకుండా అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం భవిష్యత్తులో ముఖ్యమంత్రి మెడకు ఉచ్చులా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించే అధికారం సీఎంకి ఉన్నప్పటికీ ఎల్ వి సుబ్రహ్మణ్యం ను తొలగించిన విధానం సరిగ్గా లేదనని ఆయన విమర్శించారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇదే బహుమానం అయితే, ఇది మరీ దారుణమని ఆయన అన్నారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం బదిలీపై కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
previous post