కడప జిల్లా రాజంపేట ను జిల్లా గా నెల లోపు ప్రకటించక పోతే నందలూరు జడ్పీ టిసి పదవికి, జిల్లా అధికార ప్రతినిధి పదవులకు రాజీనామా చేస్తా మని ముఖ్యమంత్రి కి వీడియో సందేశంలో నందలూరు వైసీపీ జడ్పీ టిసి గడి కోట ఉషారాణి, భర్త జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి గడికోట సుబ్బా రెడ్డిలు తెలిపారు. రాజంపేట ను నూతనంగా ప్రకటించిన రాయచోటి అన్నమయ్య జిల్లా లో విలీనం చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.ఈ నేపధ్యంలో రాజంపేట వ్యాప్తంగా అన్నీ పార్టీలు,వివిధ సంఘాల వారితో పాటూ వైసీపీ నేతలు భగ్గు మన్నారు.ఈ మేరకు వారు తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారు.అందులో భాగంగా నందలూరు వైసీపీ జడ్పీ టిసి గడి కోట ఉషారాణి, భర్త జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి గడికోట సుబ్బా రెడ్డి లు కూడా రాజంపేట కు అన్యాయం జరిగిందని తాము ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నామని నెలలోపు సమయం ఉన్నందున ఆలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజంపేట ను జిల్లా గా ప్రకటించక పోతే తాము రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వీడియో లో వెల్లడించారు. ఈ వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలల్లో చక్కర్లు కొడుతోంది.
next post