కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జిల్లా పరిపాలనాధికారి శరత్ సుడిగాలి పర్యటన చేశారు. పిట్లం జుక్కల్ మండలాల్లో ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనుల పై పంచాయతీ కార్యదర్శుల సమీక్ష నిర్వహించారు.
ఆగస్టు ముప్పై ఒకటి లోగా పల్లె ప్రగతి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆయా మండలాల ఎంపీడీవోలు తహశీల్దార్లు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.