రాష్ట్ర పురపాలిక, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ప్రారంభం అయింది. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రక్తదానం చేశారు. యూసుఫ్ గూడాలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇన్ డోర్ స్టేడియంలో సుమారు మూడు వేల మంది రక్తదానం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. లాక్ డౌన్ సమయంలో బ్లడ్ బ్యాంకుల్లో ఏర్పడిన రక్తం కొరతను తీర్చేందుకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.