ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ వీఎం వేలుమణి మద్రాసు హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు, జస్టిస్ బట్టు దేవానంద్ ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ డి రమేష్ ఆంధ్రప్రదేశ్ నుండి అలహాబాద్ హైకోర్టుకు, జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టు నుండి కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ డి నాగార్జున తెలంగాణ నుండి మద్రాసు హైకోర్టుకు , జస్టిస్ టి రాజా మద్రాస్ హైకోర్టు నుండి రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డి తెలంగాణ నుండి పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియమ్ సిఫార్సు చేసింది.