రాజకీయ విద్వేషాలతోనే సీఎం జగన్ రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపి సుజనా చౌదరి రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఈ 7 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని ఆయన అన్నారు.
రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సుజనా చౌదరి అందజేశారు. అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఎంపీ సుజనాచౌదరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హైకోర్టు ఉంటే రాజధాని అవుతుందా అని సుజనా చౌదరి ప్రశ్నించారు.