కడప జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వై.ఎస్.ఆర్ జిల్లా జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు.
సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ‘స్పందన’ కార్యక్రమంలో బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను తెలుసుకున్నారు. ‘స్పందన’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.