వైద్యం ఆధునికీకరణ కు నోచుకున్న… భ్రూణహత్యలు తగ్గట్లేదని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష జరిగిన నేపథ్యంలో భ్రూణ హత్యలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి అన్నారు.
జిల్లా వ్యాప్తంగా పీహెచ్ సీల ద్వారా వైద్యం పెరుగుతున్న… 104,108లు ద్వారా అవగాహన కల్పిస్తున్నా ఇంటి ముంగిట వైద్యం అందుతున్నా గర్భం లో బిడ్డ చంపేయడం హేయమైన చర్య అని కలెక్టర్ అన్నారు. ఇటీవల ఫ్యామిలీ డాక్టర్.. సదుపాయం తీసుకొచ్చినా..ఈ జాడ్యం తగ్గటం లేదని కలెక్టర్ అన్నారు. ఈ మార్పు వస్తేనే… సమాజం మరింత గా అభివృద్ధి చెందుతుందని బదిలీ కాబోతున్న విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తన ఆఖరి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.