26.7 C
Hyderabad
May 3, 2024 07: 44 AM
Slider ముఖ్యంశాలు

5రాష్ట్రలకు పూర్తి.. మరో 6 పెండింగ్

#bjp

5 రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులుగా నియామకం చేసిన అధిష్టానం మరో 6 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించబోతున్నట్లు తెలుస్తోంది. అంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఝార్ఖండ్‌ భాజపా చీఫ్‌గా మాజీ సీఎం బాబూలాల్‌ మరాండీ,

పంజాబ్‌ నూతన అధ్యక్షుడిగా సునీల్ జాక్కర్, రాజస్థాన్ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ లను నియమించినట్టు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. వీరితో పాటు తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఎలక్షన్ మేజేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అధిష్టానం నియమించింది.

ఈ క్రమంలోనే కర్ణాటక , గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ అధ్యక్షులను మార్చి నూతన అధ్యక్షులను నియమించనున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా శోభా కరంద్లాజే లేదా అశ్వత్ నారాయణ్, కేరళ కు వి. మురళీధరన్ లేదా సురేష్ గోపి, గుజరాత్ కు మన్సుఖ్ మాండవియా లేదా పురుషోత్తం రూపాలా, హర్యానా కు కృష్ణపాల్ గుజ్జర్ లేదా రామ్ విలాస్ శర్మ, జమ్మూకు డా. జితేంద్ర సింగ్ లేదా ఎంపీ జుగుల్ కిషోర్, మధ్యప్రదేశ్ కు తోమర్ లేదా ప్రహ్లాద్ పటేల్ లను నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related posts

ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం: మంత్రి హరీష్

Satyam NEWS

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన  జిల్లా కలెక్టర్

Satyam NEWS

ఈ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోంది

Bhavani

Leave a Comment