హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై అమలాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ…జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కాదు…వారి ఇంటి గేటు టచ్ చేసినా జనసైనికుల ఆగ్రహం చవి చూస్తారంటూ హెచ్చరించారు. వైజాగ్ సంఘటన అనంతరం ఈవిధమైన సంఘటనలు చోటుచేసుకోవడం చూస్తే వైకాపా పైనే
అనుమానాలు రేకెత్తే పరిస్థితులు ఉన్నాయని..పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే వాస్తవాలు బయట పడతాయని..ఉమ్మడి తెలుగు రాష్ట్రాలూ జరిగిన సంఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వాస్తవాలు వెలికితీయాలంటూ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పవన్ కళ్యాణ్ కి ‘Z’ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.